హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారన్నారు. ఆయన మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మంత్రి తెలిపారు.
మిత్రుడి మరణం బాధాకరం : ఎమ్మెల్యే క్రాంతి
మిత్రుడి శ్రీధర్ బాబు ధర్మాసనం మరణం బాధాకరం అని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ఫోరమ్తో కలిసి ప్రయాణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీధర్ మరణం తెలంగాణ జర్నలిస్టులకే కాదు తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని పేర్కొన్నారు. తెలంగాణ ఎలా ఉండాలో కలలు కన్న వ్యక్తి మధ్యలోనే అందరిని విడిచి పోవడం బాధాకరం. శ్రీధర్ కుటుంబానికి ఎమ్మెల్యే క్రాంతి ప్రగాఢ సానుభూతి తెలిపారు.