ఉప్పెన..సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కు కాసుల పంట పండించింది. సుకుమార్ మరో క్రేజీ ప్రాజెక్టును ప్రేక్షకులను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి మరో శిష్యుడు కార్తీక్ వర్మతో ఈ సినిమాను అందించబోతున్నాడట సుకుమార్.
కార్తీక్ వర్మ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త ప్రాజెక్టు రాబోతుందని టాక్. మిస్టిక్ థ్రిల్లర్ గా ఈ ప్రాజెక్టు ఉండనున్నట్టు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ కోసం కార్తీక్ వర్మ సాలిడ్ స్క్రిప్ట్ను సిద్దం చేసినట్టు సమాచారం. అంతా అనుకున్నట్టుగా జరిగితే సుకుమార్ స్కూల్ నుంచి మరో దర్శకుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఖాయమైనట్టే. ఈ క్రేజీ అప్డేట్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజుల ఆగితే తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.