హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాల నిర్వహణ కోసం ఎంపికైన 30 మంది యువతకు ఆర్థికసాయం కింద ఎస్బీఐ సహకారంతో 36 శాతం సబ్సిడీపై ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం అందించారు. రైతుసేవా కేంద్రాల నిర్వహణపై యువతకు 45 రోజులపాటు నిర్వహించిన శిక్షణ ముగిం పు కార్యక్రమం శుక్రవారం మంత్రుల నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలతో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని సూచించారు. ఆగ్రోస్ కేంద్రాలపై రైతులకు నమ్మకం కలిగించాలని కోరారు. గ్రామీణుల అవసరాలు మారిపోయాయని, అందుకు తగ్గట్టుగా.. వ్యాపారాలను ప్రణాళికాబద్ధంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆగ్రోస్ శిక్షణను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత
తెలుగు భాష పరిరక్షణకు ప్రతిఒకరూ పూనుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన బీసీ కమిషన్ కార్యాలయంలో 16 మంది సాహిత్యకారులు రాసిన 16 సరళ శతకాల సమ్మేళనం శతక షోడశి పుస్తకావిష్కరణ కార్యక్రమంలోపాల్గొన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు కిషోర్గౌడ్, ఉపేంద్ర, శుభప్రద్పటేల్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు పాల్గొన్నారు.