ముంబై: 40 ఏళ్ల వయసులో ఇంకా నేను బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను. ఫిట్గా ఉండటానికే ప్రయత్నిస్తాను.. ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అన్న మాటలు. ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కేకు కలిసొచ్చే విషయాలు చాలానే ఉన్నా.. ఒక్క విషయం మాత్రం ఆందోళన కలిగించింది. అది కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఫామ్. తొలి మ్యాచ్లో డకౌటైన అతడు.. ఈ మ్యాచ్లో 17 బంతుల్లో 18 పరుగులు చేశాడు.
అయితే అతని కారణంగా మిడిల్ ఓవర్లలో సీఎస్కే రన్రేట్ మందగించింది. ఖాతా తెరవడానికే అతడు 6 బంతులు ఆడాడు. ఇదే విషయం మ్యాచ్ తర్వాత ధోనీని అడిగితే.. అతను ఇలా స్పందించాడు. మేము ఇంకా ఎక్కువ స్కోరు చేస్తే బాగుండేది అని అనిపించింది. నేను ఆడిన ఆ ఆరు బంతులు మరో మ్యాచ్లో అయితే మా కొంప ముంచేవే. అది నిజమే. అయితే 40 ఏళ్ల వయసులో ఆడుతున్నప్పుడు 24 ఏళ్ల వయసులో ఆడే ఆటను నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఫిట్గా ఉండటానికి మాత్రం ప్రయత్నిస్తా. ఈ విషయంలో టీమ్లోని యువ ఆటగాళ్లతో పోటీ పడతాను. ఫిట్నెస్ విషయంలో మాత్రం నావైపు ఎవరూ వేలెత్తి చూపకుండా చూసుకుంటాను అని ధోనీ అనడం విశేషం.
ఇవి కూడా చదవండి
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు
గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంబురాలు మొదలు
డీజిలైతే కిలోమీటర్కు రూ.18, ఎలక్ట్రికలైతే రూ.6
ఆరుపదుల వయస్సులోను జిమ్లో చెమటోడుస్తున్న స్టార్ హీరో