హైదరాబాద్ : అన్ని కులాలను, మతాలను సమానంగా ఆదరించిన గొప్ప బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుజన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న పై రూపొందించిన కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజల పట్ల ఎలాంటి వివకక్ష చూపకుండా మంచి పాలన అందించిన గొప్ప చక్రవర్తి పాపన్న అని అభివర్ణించారు. ఈ కవితా సంకలనంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 100 మంది కవులు తమ అమూల్యమైన కవితలతో ఈ సంకలనాన్ని రూపొందించారన్నారు. కార్యక్రమంలో బడేసాబ్, ఓంకార్, మల్లయ్య, శ్రీనయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.