తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ నిన్ను చేరి. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్. గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఈ సిరీస్ టైటిల్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ..శంకర్ డిస్ట్రిబ్యూటర్ గా చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారికి , నిన్ను చేరి టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
డైరెక్టర్ సాయికృష్ణ తల్లాడ మాట్లాడుతూ..నేను సినిమాలు చేస్తున్నప్పుడు విడుదల సమయంలో
థియేటర్లల్లో సరైన టైమ్ కి విడుదల అయ్యేలా కృషి చేసారు శంకర్. అప్పుడు ఒక సినిమా మీద శంకర్ కు ఉన్న గౌరవం అని తెలుసుకున్నాను, అలాంటి డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు నిర్మాత గా మారి నన్ను వారి బ్యానర్ లో డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ గా ఉంది.
అలానే చిన్నప్పుడు ఆది, లక్ష్మి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు వి.వి.వినాయక్ సార్ ను కలవాలని ఎప్పుడూ అనుకునే వాడిని. అలాంటిది ఈ రోజు సార్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు.
నిర్మాత శంకర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ఇప్పటి వరకు 175 సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా చేసాను. ఇప్పుడు నిర్మాతగా మారి నిన్ను చేరి అనే వెబ్ సిరీస్ ని నిర్మించాను. ఈ సిరీస్ లోగో ని మా అన్నయ్య వి.వి.వినాయక్ చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది
నటి నటులు: రాజు అనేం, మాధురి, బేబీ హాసిని, గౌతమ్ రాజు,భద్రం, కిషోరో దాసు,శాంతి స్వరూప్ తదితరులు.
కథ మాటలు: శివ కాకు
సంగీతం: వి.ఆర్.ఏ.ప్రదీప్
సౌండ్ ఎఫెక్ట్స్: వెంకట్
గ్రాఫిక్స్: రాహుల్
బ్యానర్ : తేజా హనుమాన్ ప్రోడక్షన్స్
నిర్మాత : శంకర్ కొప్పిశెట్టి
డైరెక్టర్: సాయికృష్ణ తల్లాడ