హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నది గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వారికి కావాల్సిన వసతులను, ఆర్థిక సహాయాన్ని చేస్తూ వారి లక్ష్యాలను నెరవేర్చడంలో ప్రభుత్వం దోహదపడుతుందన్నారు. టాంజానియాలో గల కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాకు చెందిన యశ్వంత్, అతని తల్లిదండ్రులు, శిక్షకులను హైదరాబాద్ మంత్రుల నివాసంలో సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భవిష్యత్లో ఇలాంటి సాహసోపేత పర్వతారోహణలకు సంపూర్ణ తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. కిలిమంజారో పర్వతం అధిరోహించడం కోసం లక్షన్నర రూపాయలు ఆర్థిక సాయం చేయడంతో యశ్వంత్, ఆయన కుటుంబ సభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
జమ్ము కాశ్మీర్ లేహ్ లడక్ ప్రాంతంలోని ఆరు వేల మీటర్ల ఎత్తయిన కహర్ డుమ్లా పర్వతశ్రేణిని, కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రాష్ట్ర ప్రభుత్వ పతాకాన్ని ఎగురవేయడం పట్ల యశ్వంత్ను మంత్రి ఘనంగా సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
China Education : ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి : మంత్రి హరీశ్రావు
Twin Towers: 40 అంతస్తుల ట్విన్ టవర్స్ను కూల్చేయండి : సుప్రీంకోర్టు