కరీమాబాద్, ఏప్రిల్ 28 : టీఆర్ఎస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం 43వ డివిజన్లో పలువురు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. వరంగల్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల సమయంలోనే డివిజన్లు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఐనవోలు ఎంపీపీ మార్నేని మధుమతి, మాజీ కార్పొరేటర్ పసునూరి స్వర్ణలత, డివిజన్ అధ్యక్షుడు నోముల వెంకట్రెడ్డి, నాయకులు వజ్రయ్య, సాధిక, యాకూబ్ఖాన్, గజపతి, సదానందం, గడ్డం శ్యాంసుందర్, దామోదర్, హేమలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.