కొమురవెల్లి/దుబ్బాక టౌన్/చేర్యాల, మే 9 : అన్ని మతాలను ప్రభుత్వం ఆదరిస్తున్నదని సర్పంచ్ ఎర్రవెల్లి రామ్మోహన్రావు అన్నారు. మండలంలోని చిట్యాల గ్రామంలో ముస్లింలకు రంజాన్ దుస్తులను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తేడా లేకుండా అన్ని మతాల పండుగలకు బట్టలను పంపిణీ చేసి వారిని గౌరవిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మిట్టపల్లి సులోచనశ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ పంజాల లతరాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రంజాన్ కిట్ల పంపిణీ
కఠినమైన ఉపవాసాలు ఉండే రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ధానధర్మాలకు ప్రతీక అని బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్టు అధ్యక్షుడు చాంద్మియా అన్నారు. ఆదివారం ట్రస్టు ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని 50 మంది వృద్ధులు, వితంతువులు, నిరుపేదలకు ఒక్కొక్కరికీ రంజాన్ కిట్లతో పాటు రూ.400 ఆర్థిక సాయం అందజేశారు. ట్రస్టు సభ్యులు వసీం, జమీర్, సల్మాన్, షబ్బీర్మియా, అమీర్ అలీ, అలీం తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లిలో..
కొమురవెల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు దక్కుతున్నాయన్నారు.టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలారి కిషన్, సార్ల కిష్టయ్య, ముత్యం నర్సింహులు, ఏర్పుల మహేశ్, సార్ల సురేశ్ పాల్గొన్నారు.