జయశంకర్ భూపాలపల్లి : ఈ నెల 23వ తేదీన జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే భారతీయులకు కూడా ఆమె శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఒలింపిక్స్లో భారతీయులు అనేక పథకాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని, దేశ ప్రతిష్టను పెంచాలని మంత్రి సత్యవతి ఆకాంక్షించారు.