హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అందరి జీవితాలు ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలతో నిండి శోభిల్లాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లల కళ్లల్లో రంగులు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహజ రంగులు, నీటితోనే పండుగను నిర్వహించుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ అన్ని మతాలు, వర్గాల కలయికగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోందని.. హోలీ కూడా కులమతాలకు అతీతంగా ప్రజలంతా సంతోషంగా జరుపుకొనే పండుగ అని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జానారెడ్డి గతం.. టీఆర్ఎస్ భవిష్యత్తు: బాల్క సుమన్
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ఫిలిం ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ హీరోగా ఇర్ఫాన్, హీరోయిన్గా తాప్సీ
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు: మంత్రి అల్లోల