వినాయక్నగర్, జూన్ 1: కరోనా బారిన పడ్డ వారు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సూచించారు. మంగళవారం అల్వాల్ డివిజన్ వెంకటాపురంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అన్ని సౌకర్యాలతో ఐసొలేషన్ ఏర్పాటుచేశామని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా విపత్తుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, డీసీ డాక్టర్ తిప్పర్తి యాదయ్య, ఈఈ రాజు, డీఈ మహేష్, సీఐ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం సివై రాజు, చెట్ల రవి భాస్కర్ సహకారంతో కొవిడ్-19 బా ధితులను దవాఖానకు, మృతదేహాలను తరలించడానికి ఏర్పాటుచేసిన అంబులెన్స్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రె డ్డి, రాజ్ జితేంద్రనాథ్, డీసీ డాక్టర్ యాదయ్య, కొండల్రెడ్డి, బలవంతరెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ డివిజన్ భారతినగర్లో రూ.54లక్షలతో చేపట్టిన అభివృద్ధిపనులకు కార్పొరేటర్ శాంతీశ్రీనివాస్రెడ్డితో కలసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో అల్వాల్ సర్కిల్ను అభివృద్ధిపరచి ప్రథమ స్థానంలో నిలబెడతానని అన్నారు. అభివృద్ధిపనులను వేగవంతంగా పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ డాక్టర్ తిప్పర్తి యాదయ్య, ఈఈ రాజు, డీఈ మహేశ్, ఏఈలు లక్ష్మి, రవళి, విజయ రామరావు, నాయకులు కొండల్రెడ్డి, బలవంత రెడ్డి, నాగేశ్వరరావు, కాలనీ నాయకులు శ్రీధర్, నరేందర్రెడ్డి, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.