హైదరాబాద్: ప్రైవేటుకు దీటుగా గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. గిరిజన బిడ్డలను విద్యావంతులను చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడకముందు 91 గిరిజన గురుకులాలు మాత్రమే ఉండేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం మరో 92 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ సీట్లు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే గిరిజనుల్లో అక్షరాస్యత శాతం ఇప్పుడు అత్యధికంగా పెరిగిందన్నారు. గిరిజనులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు.
ప్రతిభ కళాశాలలను స్థాపించామని, విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయస్థాయి పోటీలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని, తద్వారా ప్రతి ఏడాది వందల మంది జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని చెప్పారు. ఇలాంటి విద్యార్థులకు ప్రోత్సహించడానికి ప్రతి ఐఐటీ విద్యార్థికి ఒక లాప్టాప్, రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.