మహబూబాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మానుకోట రాళ్ల చరిత్ర తెలియని బండి సంజయ్, ఆ రాళ్ల గురించి మాట్లాడితే వాటికిందే బీజేపీని, సంజయ్ని సమాధి చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. శుక్రవారం మహబూబాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదులపై మానుకోటలో రాళ్లు వేసినప్పుడు బండి సంజయ్ కౌన్సిలర్గా రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నాడన్నారు. ఆ రాళ్లు టీఆర్ఎస్ సొంతమని, మారోమారు వాటి గురించి మాట్లాడితే వాటితోనే సమాధానం చెబుతామని మంత్రి హెచ్చరించారు.