మహబూబాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును మహబూబాబాద్లో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయర్తో, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సద్గురు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆయన నిండుగా నూరేళ్లు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా శక్తినివ్వాలని కోరుకున్నారు.
మంత్రి కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
యువనాయకుడి పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కేటీఆర్ చేపట్టిన ఉద్యమంలో అందరూ భాగస్వాములని కోరారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సంతోష్ గారు పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా నేడు మహబూబాబాద్లో లక్షన్నర మొక్కలు నాటి మంత్రి కేటీఆర్ జన్మదిన కానుక అందిస్తున్నామని చెప్పారు.