మహబూబాబాద్ : పరాయి పాలన నుంచి విముక్తి కోసం ఎంతోమంతి వీరులు పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..స్వాతంపత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. స్వాతంత్య్ర పోరాట యోధులను స్మరిస్తూ యువతలో దేశభక్తి, జాతీయ సమైఖ్యతా భావాలు పెంపొందే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత మహబూబాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు.