హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కరోనా సమయంలో కూడా సమన్వయంతో, ఎలాంటి ఇబ్బంది రాకుండా పరీక్షను నిర్వహించామన్నారు. ఎంసెట్ను తొమ్మిది విడుతల్లో నిర్వహించామని చెప్పారు. గత మూడేండ్లతో పోలిస్తే ఈ ఏడాది 28 వేల మంది విద్యార్థులు అధికంగా పరీక్ష రాశారని చెప్పారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ను 1,47,991 మంది విద్యార్థులు రాశారని అందులో 1,21,480 మంది క్వాలిఫై అయ్యారని చెప్పారు. అంటే 82.08 శాతం మంది అర్హత సాధించారన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో 79,009 మంది పరీక్ష రాయగా.. 73,070 మంది అర్హత సాధించారని చెప్పారు. అంటే 92.48 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్లో మొదటి ర్యాంక్ పశ్చిమ గోదావరికి చెందిన కార్తికేయ, రెండో ర్యాంకును వెంకట నరేష్ (రాజంపేట-కడప), మూడో ర్యాంక్ మహ్మద్ అబ్దుల్ (హైదరాబాద్), నాలుగో ర్యాంక్ రామస్వామి (నల్లగొండ), ఐదో ర్యాంక్ వెంకట ఆదిత్య (కూకట్పల్లి) సాధించారని, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్లో మొదటి ర్యాంకు మండవ కార్తికేయ (హైదరాబాద్), రెండో ర్యాంకు ఎమాని శ్రీనీజ (రంగారెడ్డి), హైదరాబాద్కు చెందిన కౌశల్ రెడ్డి మూడో ర్యాంకు సాధించారు.