కోల్కతా: పశ్చిమ బెంగాల్ నాలుగవ దశ ఎన్నికల్లో హింస చోటు చేసుకున్న చోట పోలింగ్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) వాయిదా వేసింది. కూచ్ బెహర్ జిల్లాలోని సితాల్కుచి నియోజకవర్గంలో శనివారం సీఐఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఈ నేపథ్యంలో స్పెషల్ అబ్జర్వర్ల మధ్యంతర నివేదిక ఆధారంగా సితాల్కుచిలోని 126 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ను వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది. సాయంత్రం 5 గంటలలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రత్యేక ఎన్నికల పరిశీలకులతోపాటు సీఈవోను కోరింది.
మరోవైపు కాల్పుల ఘటనపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఓటు వేసేందుకు క్యూలెన్లలో ఉన్నవారిపై కేంద్ర బలగాలతో కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. మమత ఆదివారం సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.