హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో పునఃప్రారంభానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రతిపాదనలు సిద్ధంచేసి సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పిస్తారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గడంతోపాటు, కరోనా పూర్తి నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.