వికారాబాద్ : జిల్లాలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పల్లె ప్రగతిలో భాగంగా పులుమద్ది గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ప్రారంభించారు. అనంతరం చెత్తను బయట వేయబోమని, స్వచ్ఛత కోసం పాటుపడుతామని, చెట్లను కాపాడతామని గ్రామస్తులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పల్లెల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అలాగే పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవ్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య ,కలెక్టర్ పౌసుమి బసు, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ,డీపీఓ రెహనా తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి