న్యూఢిల్లీ: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యక్తిగత ఖాతా బ్లూ టిక్ వెరిఫికేషన్ను శనివారం పునరుద్ధరించింది. ఆయన ప్రొఫైల్ నుంచి బ్లూ టిక్ను తొలిగించిన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ పునరుద్ధరించడం గమనార్హం. ఇతర ఆరెస్సెస్ నేతలు క్రుష్ణ గోపాల్, అరుణ్ కుమార్ తదితరుల వెరిఫికేషన్ కూడా పునరుద్ధరించింది.
గత కొన్ని రోజులుగా పలువురు ఆరెస్సెస్ నేతల వెరిఫికేషన్ బ్యాడ్జిని ట్విట్టర్ తొలగించిందని సంఘ్ వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు వీరి ఖాతాలను ట్విట్టర్ 2019లో తనిఖీ చేసిందని సమాచారం.
గత ఆరు నెలలుగా అన్ వెరిఫయింగ్ ఇన్ యాక్టివ్గా ఉన్న ఖాతాలకు బ్లూ టిక్ తొలగించినట్లు ట్విట్టర్ తెలిపింది. ఈ క్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరుల ఖాతాల బ్లూ టిక్ను తొలగిస్తున్నట్లు తెలిపింది.
మోహన్ భగవత్తోపాటు ఆరెస్సెస్ నేతలు అరుణ్ కుమార్, సురేశ్ సోనీ ఖాతాల బ్లూ టిక్ను కూడా తొలగించింది. ఇన్ యాక్టివ్గా ఉన్న ఖాతాలకు బ్లూ వెరిఫైడ్ బ్యాచ్ బ్లూటిక్ను తొలగిస్తుందని వివరణ ఇచ్చింది.
గతేడాది జూలై 23వ తేదీన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చివరిసారిగా తన వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ చేశారు. ఆరెస్సెస్ నేతలు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.అయితే, తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్య ఖాతా బ్లూటిక్ను పునరుద్ధరించింది.
ఒకవేళ సుదీర్ఘ కాలం లాగిన్ కాకుంటే, ఆ ఖాతాను పూర్తిగా తొలిగించి వేస్తారు. ట్విట్టర్ యూజర్ ఖాతాను నిరంతరం మేనేజ్మెంట్ తనిఖీ చేస్తూ ఉంటుంది. ట్విట్టర్ చర్యపై విమర్శలు వెల్లువెత్తడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సోషల్మీడియాను నియంత్రించడానికి నూతన ఐటీ నిబంధనలను కేంద్రం అమలులోకి తెచ్చినప్పటి నుంచి ట్విట్టర్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, తమ సిబ్బందికి ముప్పు ఉందని ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది.
ట్విట్టర్ చర్యపై కేంద్రం మండి పడింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పాఠాలు నేర్పేందుకు పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ ఉద్యోగులకు ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది.
ఐటీ నిబంధనలను పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని చివరిగా శనివారం ట్విట్టర్కు కేంద్రం నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ట్విట్టర్ ప్రకటించింది. ఈ క్రమంలో ఉప రాష్ట్రపతితోపాటు ఆర్సెస్సెస్ నేతల ఖాతాలకు బ్లూ టిక్ను ట్విట్టర్ తొలగించడం ఆసక్తికర పరిణామం.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…
ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ట్విట్టర్ బ్లూటిక్ రిమూవ్, అయితే!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?