న్యూఢిల్లీ : స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ జూన్ 20 తర్వాత దేశ రాజధానికి చేరుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీను ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్నామని భారత్ లో ఆగస్ట్ నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడతారని చెప్పారు. ఇక ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
కేసుల తగ్గుదలతో కరోనా రోగులకు సులువుగా బెడ్ లు, ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు 1.25 శాతానికి దిగివచ్చింది. ఇక గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 946 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీలో గత 47 రోజుల్లో ఆదివారం అతితక్కువగా కరోనా మరణాలు 100 లోపు పడిపోయాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.