ఖమ్మం : కరోనా కట్టడిలో భాగంగా పెనుబల్లిలో ఆక్సిజన్తో కూడిన కొవిడ్ వార్డు, మొబైల్ ఎక్స్రే మెషీన్ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రతినిత్యం పని చేస్తుందన్నారు. కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.
లాక్డౌన్ నిబంధనలు అందరు పాటించాలని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
వి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి