తూప్రాన్ రూరల్, మే 7 : కరోనా వైరస్ కట్టడి అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ మోహన్, ఆర్ఐ రమేశ్, కౌన్సిలర్లతో కలిసి శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. తీవ్రమైన జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు, అలసట తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకూడదనే ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తుందన్నారు. లక్షణాలున్నా భయపడకుండా వైద్యుల సూచనతో మందులు వా డాలన్నారు. కరోనా విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం వహించరాదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్, కుమ్మరి రఘుపతి, ఉమాసత్యలింగం, దుర్గారెడ్డి, రవీందర్గుప్తా, రాజు, మామిండ్ల జ్యోతి పాల్గొన్నారు.
ఘనపూర్లో సర్వేను పరిశీలించిన తహసీల్దార్
తూప్రాన్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆరోగ్య సర్వేను నిర్వహించారు. కార్యదర్శులు, వీఆర్ఏలు, ఏఎన్ఎం లు, ఆశవర్కర్లు, అంగన్వాడీలు ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఘనపూర్లో సర్వేను తహసీల్దార్ శ్రీదేవి పరిశీలించి, సూచనలు చేశారు.
ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు..
పట్టణంలో ఇంటింటి సర్వేను నిర్వహించి ఆరోగ్య పరిస్థితి వివరాలను సేకరిస్తున్నారు. హరిజనవాడ, రాంనగర్, శీతయ్యగుడి ప్రాంతాల్లో కుటుంబ సర్వే నిర్వహించారు. జ్వరం, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, కాళ్లు, చేతులు గుంజడం లాంటివి ఏవైనా ఉన్నాయా? అని వివరాలు సేకరించారు. సర్వే కార్యక్రమంలో అంగన్వాడీలు శోభారాణి, జమున, సంగీత, పద్మ ఉన్నారు.
ఇంటింటి సర్వేకు సహకరించాలి
ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని, అదేవిధంగా ఆరోగ్య సర్వేకు సహకరించాలని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డితో కలిసి డీ.ధర్మారం ప్రభుత్వ దవాఖానలో కరోనా టీకా తీసుకున్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది, అంగన్వాడీలు చేపట్టిన సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు.
కరోనా నివారణకు కృషి చేయాలి
కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ జైరాములు అన్నారు. నందిగామలో వైద్య సిబ్బంది చేపట్టిన సర్వేలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వైద్య సిబ్బందికి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సలోమి, అంగన్వాడీలు సీతారామలక్ష్మి, రామలక్ష్మి, ఆశ వర్కర్ గౌరీ ఉన్నారు.
వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి..
కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రతి ఒక్క రూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి అన్నారు. వెల్దుర్తి పీహెచ్సీలో రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ సరఫరా, వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలను డాక్టర్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు.
కొనసాగుతున్న సర్వే..
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఇంటింటి సర్వే వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో ముమ్మరంగా సాగుతున్నది. ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి ఎవరైనా కరోనా లక్షణాలు కలిగి ఉన్నారా? ఇతర అరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని వివరాలు సేకరిస్తున్నారు.
ప్రజారోగ్యమే ముఖ్యం..
ప్రజా అరోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నార్సింగి ఎంపీపీ చిందం సబిత,ఎంపీడీవో ఆనంద్మేరీ పేర్కొన్నారు. చేగుంట, నార్సింగి గ్రామాల్లో రెండో రోజు ఇంటింటి సర్వే చేపట్టారు. నార్సింగి మండలం జప్తిశివునూర్ పరిధిలోని సరోజని నగర్లో నిర్వహించిన సర్వేను ఎంపీపీ, ఎంపీడీవో పరిశీలించారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. నార్సింగి మండలం శేరిపల్లిలో సర్పంచ్ చెప్యాల మల్లేశం ఆధ్వర్యంలో సర్వే నిర్వహిం చారు. ఆయా కార్యక్రమాలో వైస్ఎంపీపీ సుజాత, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అందరి సహకారంతో నియంత్రణ..
ప్రజలందరి సహకారంతోనే కరోనాను అరికట్టడం సాధ్యమని తహసీల్దార్ బలరాం పేర్కొన్నారు. మండలంలోని నార్సింగి గ్రామంలో కిట్ల పంపిణీ, సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. పాపన్నపేట, పొడ్చన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 37 టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు.