ఖమ్మం : నగరంలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు, గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణ పనులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పరిశీలించారు. త్వరలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూంలు అందించనున్న నేపథ్యంలో ఆయన భవన సముదాయాలను స్వయంగా పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, గ్రీనరి, రోడ్లు, కాలువలు తదితర వసతుల పరిశీలించి, పలు సూచనలు చేశారు. ప్రకాశ్నగర్ వంతెన వద్ద కొనసాగుతున్న గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణ పనులను మంత్రి పర్యవేక్షించారు. మేయర్ పునుకొల్లు నీరజ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సూడా చైర్మన్ విజయ్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్అండ్బీ ఈఈ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.