బీ ఫారాలతోపాటు నామినేషన్లను ఉపసంహరించుకున్న అభ్యర్థులు
మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చేరికలు
నామమాత్రంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు
టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేని పరిస్థితి
మహబూబ్నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతి నిధి) : ఎన్నికలంటే పోటాపోటీగా ఉంటాయి. అభ్యర్థుల ఎత్తులు.. పై ఎత్తులు కనిపిస్తాయి. కానీ వార్ వన్ సైడ్ అ యితే.. ప్రతిపక్షాలు డీలా పడితే.. జడ్చర్ల, అచ్చంపేట ము న్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు పోటీ నామమాత్రంగా కనిపి స్తోంది. అధికార టీఆర్ఎస్కి ఎదురు లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొర కని పరిస్థితి. ప్రచార పర్వంలోనూ ప్రతిపక్షాలు నామమా త్రంగా కూడా ప్రభావం చూపిం చడం లేదు. మున్సిపల్ ఎన్నికల పోరులో జడ్చర్లలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కనీసం పోటీలో అభ్యర్థులను కూడా నిలుపుకోలేని దుస్థితికి ఆ పార్టీ చేరుకున్నది. వార్డులో కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నుంచి బీ ఫారాలు పొందిన అభ్యర్థులు వాటిని పక్కకు పెట్టి.. తమ నామినేషన్లను ఉపసంహరించుకొని అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. బీజేపీ కనీసం తన అభ్యర్థులను సైతం పోటీలో నిలబెట్టక పోవడం చూస్తే ఆ పార్టీ దీనస్థితి అర్థమవుతోంది.
బీజీపీ పరిస్థితి గోవిందా..
ఒకటో వార్డులో దండు సరస్వతికి సంబంధించిన బీ ఫారం బీజేపీ నాయకులు ఆర్వోకు అందజేసిన అనంతరం అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నది. ఆ తర్వాత అదే వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోనెల గంగకు ఇంకో బీ ఫారాన్ని అందించారు. గోనెల గంగ బీజేపీ తరపున ఒకటో వార్డు బరిలో ఉన్నా.. కనీసం ప్రచారం కూడా చేయడం లేదు. ఆరో వార్డులో పాలకొండ కృష్ణ, 18వ వార్డులో వెంకటేశ్గౌడ్, 19వ వార్డులో శోభిత కూడా బీ ఫారంతో పాటు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 15 వార్డులో బీజేపీ నాయకుడు పాలాది రామ్మోహన్ భార్య సారిక పోటీ నుంచి తప్పుకొని టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో నిలిచింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ అప్పటికప్పుడు వేరే వ్యక్తిని పోటీలో నిలిపింది. ఇక 9, 26వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా లభించలేదు. మొత్తంగా జడ్చర్ల పట్టణంలో బీజేపీకి 5 వార్డుల్లో కనీసం అభ్యర్థులు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రెండు వార్డుల్లో పోటీ కోసం అభ్యర్థులు ముందుకు రాలేదు.
నామమాత్రపు ప్రచారం
బీజేపీ కాంగ్రెస్ తరఫున జడ్చర్లలో పోటీ చేస్తున్న పలువు రు అభ్యర్థులు నామమాత్రంగా ప్రచారం చేస్తున్నారు. 2, 3, 4, 12, 14, 15, 17, 20, 23 వార్డులో ప్రతిపక్షాలు నామమాత్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఆయా వార్డుల్లో కేవలం టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పై వార్డుల్లో అనామక అభ్యర్థులను బీజేపీ బరిలో నిలిపింది.
అచ్చంపేటలో అనామకులు
అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 12, 16, 20వ వార్డులలో బీజేపీ అనామకులను బరిలో నిలిపింది. ఎవరో ఒకరు పోటీ చేస్తే చాలు.. పోటీలో మేము కూడా ఉన్నామని చెప్పుకునేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నంగా తెలుస్తున్నది. అనవసర ఢాంబికాలు లేకపోయినా బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని విశ్లేషకులు చెబుతున్నారు.
దొందూ దొందే… బీజేపీ బాటలో కాంగ్రెస్..
2, 5, 8, 9, 12, 20వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనామకులైన అభ్యర్థులను బరిలో ఉంచారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహ రించారని స్థానికులు అంటున్నారు. అనామక అభ్యర్థులపై అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యంత సులభంగా విజయం సాధిస్తారని స్థానికులు చెబుతున్నారు.