ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పా పాల్గొన్నారు. 2, 3, 19, 22, 24వ డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థులు నర్రా ఎల్లయ్య, కొనకంచి ప్రసాద్, చామకూరి వెంకన్న, పల్లా రోజ్ లీనా, కమర్తపు మురళిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి అన్నారు
ఈ మేరకు.. పాండురంగాపురం, బల్లెపల్లి, పాకబండ బజార్, పార్శిబందం, సంభాని నగర్లో విస్త్రృతంగా పర్యటించారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్తోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమని మంత్రి తెలిపారు.
అభివృద్ధిని చూసి ఆదరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే 27వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాలడుగు పాపారావు విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పువ్వాడ తనయుడు పువ్వాడ నయన్ శ్రీనివాస్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి