హైదరాబాద్: మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓటువేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే వీరేశం ఓటుహక్కు వినియోగించుకున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా హన్మకొండలోని సెయింట్ థామస్ హైస్కూల్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఓటువేశారు. నగరంలోని
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట నగర కమిషనర్ జోయల్ డేవిస్ దంపతులు ఓటు వేశారు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..