హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి 68వ సీనియర్ అంతర్జిల్లాల కబడ్డీ టోర్నీలో రంగారెడ్డి జట్టు చాంపియన్గా నిలిచింది. శుక్రవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పురుషుల ఫైనల్లో రంగారెడ్డి 46-45 పాయింట్ల తేడాతో గద్వాలపై ఉత్కంఠ విజయం సాధించింది. రైడింగ్, డిఫెన్స్లో సమవుజ్జీలుగా ఉండటంతో నిర్ణీత సమయం ముగిసే సరికి మ్యాచ్ 41-41తో టైగా ముగిసింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు మ్యాచ్ను పొడిగించడంతో రంగారెడ్డి పాయింట్ తేడాతో ట్రోఫీని వశం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి మంత్రు లు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, మాల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ రాజశేఖర్రెడ్డి, టోర్నీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ఎందుకంత బాధ : ఎమ్మెల్యే అంబటి
జోరుమీద ఆటోమొబైల్స్: కార్లు మొదలు బైక్స్ సేల్స్ పైపైకి!