హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు మంత్రి పువ్వాడ వినతి పత్రం సమర్పించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి అజయ్ కుమార్తో పాటు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు.