కరోనాను జయించిన మంత్రి పువ్వాడ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అజయ్ కుమార్ కరోనాను సమర్ధవంతంగా జయించారు. ఈనెల 14వ తేదీన నిర్వహించిన కొవిడ్ టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
14వ తేదీ నుంచి బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందారు. డాక్టర్ల సలహాలు, సూచనలను అజయ్ పాటించి కరోనా బారి నుంచి తప్పించుకున్నారు. కరోనా సోకిందన్న విషయం తెలియగానే పువ్వాడ అభిమానులు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. తాజాగా శనివారం నిర్వహించిన కోవిడ్ టెస్ట్(RT PCR)లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. కరోనా నెగటివ్ అని తేలడంతో.. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
అభిమానం మరిచిపోలేనిది..
కరోనా మహమ్మారిని జయించాడానికి తనకు ధైర్యం ఇచ్చింది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తన మీద మీకు ఉన్న ప్రేమ, అభిమానమే తనను మళ్ళీ మీ మధ్యలోకి తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. పూర్తిగా కొలుకున్నానని, సోమవారం నుండి తిరిగి విధులకు హాజరు అవుతానని ట్విట్టర్ అకౌంట్ ద్వారా మంత్రి అజయ్ వెల్లడించారు.
మీ ప్రేమాభిమానులే నాకు మందు.. నేడు చేసిన Covid టెస్ట్(RT PCR) లో నెగెటివ్ వచ్చింది. నాకు కరోనా అని తెలిసి నా కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ సోమవారం(28.12.2020) నుండి విధులకు హాజరై మీ మధ్యకు వస్తున్న.. @TelanganaCMO @MinisterKTR @KTRTRS @trspartyonline pic.twitter.com/SpWoBNBMj3
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) December 26, 2020
తాజావార్తలు
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ
- 15 గంటలపాటు సాగిన భారత్-చైనా మిలటరీ చర్చలు
- బిగ్ బాస్ ఎఫెక్ట్.. హారికకు వరుస ఆఫర్స్
- ఐటీలో ఆదా ఇలా.. ఆ మినహాయింపులేంటో తెలుసా?
- వరుణ్ తేజ్ పెళ్లిపై నోరు విప్పిన నాగబాబు
- తిరుపతికి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్
- రాష్ర్టంలో పెరుగనున్న ఎండలు
- బాలల అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్న మోదీ