రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వినూత్న రీతిలో ప్రజాసమస్యల పరిష్కారానికి పూనుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే సైకిల్పై బయలుదేరిన మంత్రి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మంత్రి వెంట మేయర్ నీరజ, కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి కూడా సైకిళ్లపై బయలుదేరారు. – ఖమ్మం