అమరావతి: ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడిలోని నివాసం వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నరేంద్రను తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఆయనపై 408, 409, 418, 420, 465, 471, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదైందయ్యిందని, ఈ నేపథ్యంలో ధూళిపాళ్లను అరెస్టు చేశామని చెప్పారు.
టీడీపీలో క్రియాశీలక నేతగా ఎదిగిన ధూళిపాళ్ల నరేంద్ర.. ఆ పార్టీ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 నుంచి 2019 వరకు పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా వీయడంతో ఓడిపోయారు. కాగా, 2010 నుంచి ఆయన సంగం డెయిరీకి చైర్మన్గా కొనసాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..