ప్రాజెక్టు నిర్మాణానికి రూ.76.92కోట్లు విడుదల
పనులు పూర్తయితే 8వేల ఎకరాలకు సాగునీరు
ఆనందంలో అన్నదాతలు
నాగర్కర్నూల్, జూన్ 5 : మార్కండేయ ప్రాజెక్టు నిర్మాణంతో బిజినేపల్లి మండల రైతాంగానికి మహర్దశ పట్టనున్నది. ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయితే 8వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఇందుకు ప్రభుత్వం రూ.76.92కో ట్లు మంజూరు చేసింది. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కృషితో నిధుల మంజూరుకు పరిపాలనా అనుమతి లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన మార్కండేయ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో బిజినేపల్లి మండలంలోని 5 గ్రామాలకు, 17 గిరిజన తండాలకు సాగునీరు అందనున్నది. త్వరలోనే టెండర్లు పిలిచి ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో వ్యవసాయ పొలాలకు సాగునీరు అందిస్తుండగా, మార్కండేయ ప్రాజెక్టుతో మండలంలోని ప్రతి గుంట కూ పూర్తిస్థాయిలో నీరంది సస్యశ్యామలం కానున్నది.
రైతులకు పుష్కలంగా సాగునీరు
మార్కండేయ ప్రాజెక్టు పూర్తయితే రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. ఎమ్మెల్యే మర్రి జ నార్దన్రెడ్డి అహర్నిశలు కృషి చేసి గంగారం గ్రామ సమీపంలో ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం సంతోషంగా ఉంది.
సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం. మార్కండే య ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నిధులు మం జూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మండ ల ప్రజలు రుణపడి ఉంటారు. త్వరలోనే టెండర్లు పలిచి పనులు ప్రారంభిస్తాం. ప్రాజెక్టుకునిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.