వనపర్తి: సీఎం కేసీఆర్ చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విప్లవాత్మకమైనదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని ఆత్మకూరులో కొత్తగా నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరణి వెబ్సైట్ ప్రపంచంలోనే గొప్ప ప్రయోగమని చెప్పారు. దీనివల్ల ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. ప్రజలకు పాలనను చేరువ చేయడానికి, పారదర్శక పాలనను అందించడానికి సీఎం కేసీఆర్ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.