వనపర్తి : పేద ప్రజలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని తన నివాసంలో లబ్ధిదారులకు రూ.11.91 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందన్నారు. ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ