వనపర్తి : ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎంఆర్ఎఫ్ ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు.
పేద ప్రజలను ప్రభుత్వం ఎల్లప్పడు అండగా ఉంటుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.