రేవంత్రెడ్డిని హెచ్చరించిన మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పీసీసీ పదవిని రూ.50 కోట్లకు కొనుక్కున్న రేవంత్రెడ్డి.. సీఎం కేసీఆర్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను విమర్శించడానికి రేవంత్రెడ్డి స్థాయి ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్మెయిలర్, చర్లపల్లి జైలుకెళ్లొచ్చినోడని తూర్పారబట్టారు. కరెంట్, నీళ్లు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు, కులవృత్తుల వారికి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.