మేడ్చల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/ కంటోన్మెంట్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. బోయిన్పల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తన సవాల్ను స్వీకరించి రేవంత్ ఎంపీ పదవికి రాజీనామాచేస్తే.. మంత్రి పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ‘నీ మీద నీకు నమ్మకం ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి.. మళ్లీ గెలిచి కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు యత్నించు’ అంటూ హితవు పలికారు. గతంలో పీసీసీ పదవుల్లో ఉన్నవారు ఎవరూ ఇంత దిగజారి మాట్లాడలేదని విమర్శించారు. కష్టపడి సంపాదించుకుని ఉన్నతస్థాయికి వచ్చానని, తన ఆస్తులపై బ్లాక్ మెయిల్ చేస్తే భయపడుతున్నానుకుంటున్నావా? అని ప్రశ్నించారు. తన కాలేజీలు, దవాఖానలపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.