సుల్తాన్బజార్/ అంబర్పేట, మే 19 : కొవిడ్ కేంద్రాలుగా సేవలందిస్తున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్కోఠి జిల్లా దవాఖాన, నల్లకుంట ఫీవర్ దవాఖానలను బుధవారం నగర సీపీ అంజనీకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సిటీ పోలీస్ హెల్ప్డెస్క్, పోలీస్ ఔట్పోస్టులలో పోలీసులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారనే అంశాన్ని పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు కృషి చేయాలని అన్నారు. కొవిడ్ టెస్టుల కోసం వచ్చే రోగులు క్యూలైన్లో భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. సీపీ వెంట నగర అదనపు పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్, ఏసీపీలు మురళీ కృష్ణ, ఆకుల శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్రెడ్డి, కాచిగూడ డివిజన్ కొవిడ్ ఇన్చార్జి ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, నారాయణగూడ, కాచిగూడ ఇన్స్పెక్టర్లు గట్టుమల్లు, రవి ఉన్నారు.