యైటింక్లయిన్ కాలనీ, జూన్ 1: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తన స్నేహితుడి తండ్రి ఆపదలో ఉన్నాడని ఆదుకోవాలంటూ ఓ యువకుడు కేటీఆర్కు ట్వీట్ చేయగా వెంటనే స్పందించి బ్లాక్ ఫంగస్కు అవసరమైన ఇంజెక్షన్ సమకూర్చారు. పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ పట్టణానికి చెందిన మహ్మద్ మొయినొద్దీన్ కరోనా రావడంతో గత నెల 27న హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖాన లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో వైద్యులు బ్లాక్ ఫంగస్గా గుర్తించారు. ఇందుకుగాను అంప్రోటిసిన్ బీ ఇంజక్షన్ కావాలని వైద్యు లు సూచించడంతో 2 రోజులుగా హైదరాబాద్లోని మెడికల్ షాపులు తిరిగినా దొరకలేదు. మొయినొద్దీన్ కుమారుడు వాసిం అక్రమ్ స్నేహితుడు అనిల్ ఈ సమస్యను ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్ తన సిబ్బందిని దవాఖానకు పంపించి ఇంజెక్షన్ అందించడంతోపాటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించా రు. సత్వరమే సాయం చేసిన మంత్రి కేటీఆర్కు అక్రమ్, అనిల్ కృతజ్ఞతలు తెలిపారు.