నాయిని నర్సింహారెడ్డికి మంత్రి కేటీఆర్ పరామర్శ

హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
గత నెల 28న కరోనా బారినపడిన నాయిని.. బంజారాహిల్స్లోని ఓ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఆక్సిజన్ పడిపోవడంతో ఈ నెల 13న దవాఖానకు తరలించారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహా రెడ్డి గారిని పరామర్శించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS.
— TRS Party (@trspartyonline) October 19, 2020
నాయిని నర్సింహా రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని కోరిన మంత్రి. pic.twitter.com/0vfVcg1BY6
తాజావార్తలు
- కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్ ధర
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?
- శ్రీమతికి మహేష్ బర్త్డే విషెస్.. పోస్ట్ వైరల్
- రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు
- శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం
- కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్బాల్ పోటీల కసరత్తు