నల్లగొండ : నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఆయన గులాబీ పార్టీలో చేరారు.
కడారి అంజయ్య యాదవ్కు.. సీఎం కేసీఆర్ కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అంజయ్య యాదవ్ చేరికతో సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత పటిష్టంగా తయారైంది.
సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ టికెట్ ఆశించిన అంజయ్య యాదవ్కు ఆ పార్టీ అధిష్ఠానం మొండి చెయ్యి చూపడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకొని సీఎం కేసీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలో చేరారు.