ఎలక్ర్టిక్ వాహనాల నూతన విధానం విడుదల

హైదరాబాద్ : రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. రాష్ర్టాన్ని ఎలక్ర్టిక్ వాహనాల హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. ఎలక్ర్టిక్ వాహనాలు, ఇంధన నిల్వలకు కొత్త విధానం అమలు చేయనున్నారు. 2020-2030 వరకు ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు.
పాలసీ విడుదల కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్కుమార్ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఎస్ బ్యాంకు చైర్మన్ సునీల్ మెహతా తదితరులు పాల్గొన్నారు.
వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు
తయారీదారులు, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు కల్పించింది. వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. రాష్ర్టంలోనే కొనుగోలు చేసి,రిజిస్ర్టేషన్ చేయించుకుంటే పలు రాయితీలకు అవకాశం కల్పించింది. ఈ విధానం అమలుకు ఉన్నతాధికారులతో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
మెగా ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ
ఆయా పరిశ్రమలు, మెగా ప్రాజెక్టులు రూ. 200 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టడం జరిగింది. పెట్టుబడి మొత్తంలో మెగా ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ కల్పించనున్నారు. విద్యుత్ ఛార్జీలు, స్టాంపు, రిజిస్ర్టేషన్ ఫీజులపై రాయితీలు ఇవ్వనున్నారు.
మొదటి 2 లక్షల బైక్లకు రహదారి పన్ను మినహాయింపు
మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలకు రహదారి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. 5 వేల ఫోర్ వీలర్లు, 10 వేల లైట్ గూడ్స్, క్యారియర్లకు పూర్తిగా పన్ను రద్దు చేయనున్నారు. ప్రజా రవాణాలోనూ ఎలక్ర్టిక్ వాహనాల వినియోగానికి కసరత్తులు చేస్తున్నారు. పార్కింగ్, ఛార్జింగ్ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకనున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేసి ప్రత్యేక రుసుములు వసూలు చేయనున్నారు. జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ ఎలక్ర్టిక్ వెహికిల్ పాలసీ కొంత కాలం క్రితం క్యాబినెట్ ఆమోందించిన విషయం తెలిసిందే. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ర్టిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రంలోనే తయారీ యూనిట్లు, చార్జింగ్ పాయింట్లను పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రజలు ఎక్కువగా ఎలక్ర్టిక్ వాహనాలు కొనుగోలు చేసేలా రాయితీలను ప్రకటించింది.
Ministers @KTRTRS and @puvvada_ajay unveiled the Telangana Electric Vehicle and Energy Storage Policy 2020-2030 at Telangana Electric Vehicle Summit in Hyderabad. Principal Secretaries @jayesh_ranjan and Sunil Sharma also participated. pic.twitter.com/z1plOe3o6I
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 30, 2020
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- ఈనెల 30న అఖిలపక్ష సమావేశం
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్మేళా
- భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్