జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని మంత్రులు కేటీఆర్, కొప్పులు ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనంలో కేటీఆర్ మొక్కను నాటారు. ఖాదీ మైదానంలో రూ.6.5కోట్లతో చేపట్టనున్న అధునాతన మార్కెట్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విద్యా సాగర్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ ఛైర్మన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.