హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో పర్యటిస్తారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు జడ్చర్లకు మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. జడ్చర్లలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను ప్రారంభిస్తారు. తర్వాత హౌసింగ్బోర్డు కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కావేరమ్మపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలిస్తారు. అనంతరం జడ్చర్ల గంజ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేట బయలుదేరుతారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, సమీకృత మార్కెట్కు, స్మృతివనంలో అభివృద్ధిపనులు, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..