అమరావతి,జూలై:అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని విశాఖ వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40నుంచి 65కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ కారణంగా మత్స్యకారులు ఈనెల15వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఒడిశా,ఉత్తర కోస్తాంధ్ర,మధ్య పశ్చిమ మధ్య,వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణశాఖ పేర్కొంది.