వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) నగరంలోని కార్యాలయ ప్రాంగణంలో సొంత పెట్రోల్ బంక్ను నెలకొల్పుతుంది. ఫ్యూయల్ బిల్లుల తగ్గింపునకు అదేవిధంగా కార్పొరేషన్ వాహనాలకు నాణ్యమైన ఫ్యూయల్ నిమిత్తం ఈ పెట్రోల్ స్టేషన్ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిర్మాణం ప్రారంభించుకున్న పెట్రోల్ స్టేషన్ మరో 10 నుండి 15 రోజుల్లో పూర్తి కానుంది.
అధికారుల వాహనాలు, చెత్త సేకరణ వాహనాలతో కలుపుకుని జీడబ్ల్యూఎంసీ మొత్తం 265 వాహనాలను కలిగిఉంది. హెచ్పీసీఎల్తో కుదుర్చుకున్న ఒప్పందంతో 73 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోల్ పంపును జీడబ్ల్యూఎంసీ నెలకొల్పుతుంది. పెట్రోల్, డీజీల్ నిమిత్తం జీడబ్ల్యూఎంసీ నెలకు రూ. 50 లక్షలు చెల్లింపులు చేస్తున్నట్లు జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ సీహెచ్.నాగేశ్వర్ తెలిపారు.