న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది డిసెంబర్లో 1.6 శాతానికి పెరిగింది. తయారీ రంగ అత్యుత్తమ ప్రదర్శనే ఇందుకు ప్రధాన కారణం. ఐఐపీలో తయారీ రంగం వాటా 77.63 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పెరిగిన తయారీ రంగ కార్యకలాపాలు.. ఐఐపీని నెల రోజుల విరామం తర్వాత మళ్లీ పాజిటివ్ జోన్లోకి తీసుకొచ్చాయి. కాగా, 2019 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి 0.4 శాతానికే పరిమితమైంది. దీంతో 2020 డిసెంబర్లో 1.1 శాతం వృద్ధి నమోదైనైట్లెంది. నిరుడు మార్చిలో ఐఐపీ గణాంకాలు ఏకంగా మైనస్ 18.7 శాతానికి దిగజారిన సంగతి విదితమే. కరోనా వైరస్ ప్రభావంతో వచ్చిపడిన లాక్డౌన్ కారణంగా ఆగస్టు వరకు ఇదే తీరు కొనసాగింది. సెప్టెంబర్లో తిరిగి కోలుకోగా, అక్టోబర్లో 4.2 శాతం పుంజుకున్నది. కానీ నవంబర్లో మైనస్ 2.1 శాతానికి దిగజారింది. ఈ క్రమంలో మళ్లీ డిసెంబర్లో వృద్ధి కనబరిచింది. అయితే డిసెంబర్లో గనుల రంగ ఉత్పత్తి 4.8 శాతం క్షీణించినట్లు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం తెలియజేసింది. అయినప్పటికీ విద్యుదుత్పత్తి 5.1 శాతానికి ఎగిసినట్లు ప్రకటించింది. మరోవైపు ఏప్రిల్-డిసెంబర్ వ్యవధికిగాను ఐఐపీ గణాంకాలు మైనస్ 13.5 శాతంగా ఉన్నాయి.