మెగా హీరో వరుణ్ తేజ్ ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న వరుణ్ తేజ్ మరోవైపు హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉండగా, కరోనా వలన వాటికి బ్రేక్ పడింది. అయితే తాజాగా మరో కథను వరున్ ఓకే చేసినట్టు తెలుస్తుంది.
నాగ శౌర్యతో ఛలో, నితిన్ భీష్మ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల రీసెంట్గా వరుణ్ తేజ్కు స్టోరీ లైన్ వినిపించాడట. ఇది వరుణ్కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాల షూటింగ్ పూర్తయ్యాక వెంకీ కుడుముల సినిమాను మొదలు పెట్టనున్నాడు. దసరా నుండి మొదలయ్యే అవకాశం ఉందని ఓ టాక్ అయితే వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని తెలిసింది.